Revanth Reddy: వికారాబాద్ జిల్లా బొంరాస్ పేటలో రేవంత్ రెడ్డి... దాడులను తేలికగా తీసుకున్న కాంగ్రెస్ నేత!

  • దాడులను తేలికగా తీసుకున్న రేవంత్ రెడ్డి
  • మదన్ పల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం
  • రేవంత్ కు స్వాగతం పలికిన అభిమానులు

ఓ వైపు తన ఇల్లు, తన బంధువుల ఇళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరుపుకున్న వేళ, తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కగా, దీన్నేమీ పట్టించుకోని రేవంత్ తన పనిలో తానున్నారు. ఈ దాడులను తేలికగా పరిగణిస్తున్న ఆయన, ఈ ఉదయం వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం మదన్ పల్లిలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

తమ గ్రామానికి వచ్చిన రేవంత్ కు ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికాయి. ఈడీ సోదాలపై ఏ మాత్రం ఆందోళన లేకుండా రేవంత్ కనిపించినట్టు తెలుస్తోంది. ఆయన ప్రచారం, మదన్ పల్లి నుంచి, బురాన్ పూర్, బొంరాస్ పేట మీదుగా మహబూబ్ నగర్ జిల్లా కొస్గి మండలం పోలేపల్లి వరకూ సాగుతుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. 

  • Loading...

More Telugu News