మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీనే.. మరోసారి ఏకగ్రీవమైన ఎన్నిక!
- పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అసద్
- తండ్రి మరణంలో పార్టీ బాధ్యతలు
- 2008లో తొలిసారి అధ్యక్షుడైన అసద్
2008లో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు సలావుద్దీన్ ఒవైసీ కన్నుమూయడంతో ఆయన పెద్ద కుమారుడు అసదుద్దీన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. పార్టీ నిబంధనల మేరకు ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. మజ్లిస్ పార్టీ చీఫ్ గా అసదుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇది మూడోసారి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అసద్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.