Mumbai: ఇంటిని కొని దారుణంగా మోసపోయిన ప్రముఖ గాయని అనురాధ పౌడ్వాల్!

  • ముంబైలో తక్కువ ధరకే ప్లాటంటూ ప్రకటనలు
  • ఒకే ప్లాట్ ను పలువురికి విక్రయించిన బిల్డర్లు
  • కొని మోసపోయి, పోలీసులను ఆశ్రయించిన బాధితులు

బాలీవుడ్ ప్రముఖ సింగర్ అనురాధ పౌడ్వాల్‌, ముంబైలో ఓ ప్లాట్ ను కొనుగోలు చేసి దారుణంగా మోసపోయారు. ఆమెకు విక్రయించిన ప్లాట్ నే బిల్డర్లు మరింతమందికి విక్రయించారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఈ ఏడుగురిలో ఇద్దరిని రాజూ సులేరె, అవినాశ్‌ గా గుర్తించారు.

అర్నాల్ బీచ్ సమీపంలో తక్కువ ధరలకే ప్లాట్లను విక్రయిస్తున్నామని బిల్డర్లు ప్రకటనలు గుప్పించగా, అనురాధ సహా పలువురు ప్లాట్ల కోసం డబ్బులు చెల్లించారు. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించిన బిల్డర్లు, ఒకే ప్లాట్ ను వేర్వేరు వ్యక్తులకు విక్రయించారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మిగతా ఐదుగురు బిల్డర్లను గుర్తించేందుకు విచారణ ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. ఈ విషయమై అనురాధ పౌడ్వాల్ స్పందిస్తూ, ప్లాట్ బుక్ చేసుకుని తాను మోసపోయానని, ఈ విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.

  • Loading...

More Telugu News