aanand: అందరూ నన్ను చూసి హీరో రఘు అనుకున్నారు: సీనియర్ హీరో ఆనంద్

  • రఘు హీరోగా చేసిన మూవీకి వెళ్లాను 
  • నేనే రఘు అని అంతా అనుకున్నారు 
  • హీరోను కావాలని అప్పుడే అనుకున్నాను

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో ఆనంద్ హీరోగా చేశారు. మణిరత్నం చేసిన 'దొంగ దొంగ' సినిమాలో ఒక హీరోగా ప్రశాంత్ నటించగా .. మరో హీరోగా ఆనంద్ నటించారు. ఆ సినిమా ఆయనకి మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది. చాలాకాలం పాటు హీరోగా కొనసాగిన ఆయన, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. రీసెంట్ గా తెలుగులో ఆయన 'సైరా' సినిమాలో చేస్తున్నారు.

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన విషయాలను ప్రస్తావించారు. "ఒకసారి రెహమాన్ (రఘు) హీరోగా చేసిన మలయాళ మూవీకి వెళ్లాను. ఆ సినిమా థియేటర్ దగ్గర నన్ను చూసిన వాళ్లంతా హీరో రెహమాన్ అనుకున్నారు. సినిమా వదిలాక అంతా నా చుట్టూ చేరారు. దాంతో నా సన్నిహితులు హీరోగా ట్రై చేయమని చెప్పారు. అలా నేను చేసిన ప్రయత్నం ఫలించి, బాలచందర్ సినిమాలో ఛాన్స్ దక్కింది .. మలయాళం లో రెహమాన్ చేసిన పాత్రను తమిళంలో నేను చేసే అవకాశం రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది" అని చెప్పుకొచ్చారు.    

More Telugu News