karthi: వరదల్లో చిక్కుకున్న కార్తీ సినిమా టీమ్ .. నిర్మాతకి భారీ నష్టం

  • కార్తీ హీరోగా సెట్స్ పై 'దేవ్'
  • 50 కోట్ల రొమాంటిక్ ఎంటర్టైనర్ 
  • డిసెంబర్ 21వ తేదీన రిలీజ్    

కార్తీ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'దేవ్' రూపొందుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 50 కోట్ల బడ్జెట్ తో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత లక్ష్మణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం 'కులుమనాలి'లో జరుగుతోంది. కొన్ని రోజులుగా అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

అయితే, తాజాగా అక్కడి వరదల కారణంగా ఈ రోజు షూటింగు ఆగిపోయింది. ఈ సినిమా కోసం పనిచేస్తోన్న 140 మంది వరదల్లో చిక్కుకుపోయారు. షూటింగు ఆగిపోయిన కారణంగా నిర్మాతకి 1.5 కోట్ల నష్టం వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇంతకుముందు కార్తీ .. రకుల్ కాంబినేషన్లో వచ్చిన 'ఖాకీ' భారీ విజయాన్ని సాధించింది. దాంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.    

More Telugu News