apcc: ఈ నెల 25న ఏపీసీసీ ఎస్సీ, ఎస్టీ విభాగాల‌ ఆత్మీయ సమ్మేళనం

  • విజయవాడలో ఈ స‌మావేశం జరుగుతుంది
  • కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి చర్యలు
  • ఎస్సీ, ఎస్టీ విభాగాల భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై చర్చిస్తాం

ఈ నెల 25న విజ‌య‌వాడ‌లో ఏపీసీసీ ఎస్సీ, ఎస్టీ విభాగాల ముఖ్య నాయ‌కుల‌తో రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం చైర్మ‌న్ కొరివి విన‌య్‌కుమార్‌, ఎస్టీ విభాగం చైర్మ‌న్ కె.సుధాక‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ మేర‌కు ఏపీసీసీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల చేశారు. ఈ నెల 25 ఉద‌యం10 గంట‌ల‌కు విజయవాడలోని శ్రీ‌రామ ప్యాలెస్ పంక్ష‌న్ హోల్ లో ఈ స‌మావేశం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి చర్యలు, రాబోయే ఎన్నిక‌ల దృష్ట్యా ఎస్సీ, ఎస్టీ విభాగాల భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై ఈ సమావేశంలో చ‌ర్చ జ‌రుగుతుంద‌ని అన్నారు. ఏపీసీసీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి అధ్య‌క్ష‌త‌న జరగనున్నఆత్మీయ స‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మానికి కేర‌ళ మాజీ సీఎం ఉమెన్ చాందీ, ఏఐసీసీ నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొంటారని తెలిపారు.

More Telugu News