వీడిన విజయవాడ పరువు హత్య పోస్టర్ల మిస్టరీ!
- సత్యనారాయణపురంలో వెలసిన పోస్టర్లు
- సోని రాహు ప్రియలు పరువు హత్యకు గురవుతారని హెచ్చరిక
- మిస్టరీని ఛేదించిన పోలీస్ అధికారులు
తాజాగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు.. పోస్టర్లను అతికించిన యువకుడిని పట్టుకున్నారు. అతడిని చిట్టి లక్ష్మినారాయణగా గుర్తించారు. అతడిని ఈ ‘సోని రాహు ప్రియ’లు ఎవరిని ప్రశ్నించగా.. అతను తీరిగ్గా.. సోనియాగాంధీ-రాహుల్ గాంధీ-ప్రియాంకా గాంధీ’ అని సమాధానం ఇచ్చాడు. దీంతో విస్తుపోవడం పోలీసుల వంతయింది. చివరికి ఆ యువకుడికి మతిస్థిమితం లేదని నిర్ధారించుకున్న పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.