Maruti Rao: మారుతీరావుకు మద్దతిస్తున్న నెటిజన్లకు అమృత హెచ్చరిక!

  • సోషల్ మీడియాలో మారుతీరావుకు మద్దతు
  • కేసులు పెట్టి కోర్టుకు లాగుతానన్న అమృత
  • హత్య చేసిన వ్యక్తికి మద్దతిస్తున్నారని ఆవేదన

తన భర్త ప్రణయ్ హత్యకు మద్దతిస్తూ, తండ్రి మారుతీరావుకు అనుకూలంగా కొంతమంది నెటిజన్లు పోస్టులు పెడుతుండటంపై అమృత వర్షిణి స్పందించింది. ప్రణయ్ తో ప్రేమ నుంచి హత్య వరకూ జరిగిన అన్ని పరిణామాల్లోనూ తప్పంతా అమృతదేనని పెడుతున్న పోస్టులు, తనను అవమానించేలా ఉన్నాయని, ఈ పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడతానని ఆమె హెచ్చరించింది. వారిపై కోర్టులో కేసులు వేస్తానని చెప్పింది. దారుణమైన హత్యకు పాల్పడిన వారికి మద్దతిస్తున్నారని వ్యాఖ్యానించిన ఆమె, ఈ కామెంట్లు తనకెంతో బాధను కలిగిస్తున్నాయని చెప్పింది. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై అమృత స్నేహితులు, అత్తమామలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో మారుతీరావుకు మద్దతిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News