jc diwakar reddy: రోషం లేని వాళ్లంతా ఎమ్మెల్యేలు అయ్యారు: జేసీ దివాకర్ రెడ్డి

  • సీఐ మాధవ్ వ్యాఖ్యలు అందరికీ వర్తిస్తాయి
  • నన్ను అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ అన్నట్టే
  • పోలీసుల తీరుపై ఏ ఒక్కరూ స్పందించలేదు

ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ అనంతపురం టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా అవుకులో ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ... సీఐ మాధవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. సీఐ మాధవ్ చేసిన వ్యాఖ్యలు కేవలం తనకొక్కడికే కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలందరికి వర్తిస్తాయని చెప్పారు. తనను అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ అన్నట్టేనని తెలిపారు. రోషం లేని వాళ్లంతా ఎమ్మెల్యేలు అయ్యారని వ్యాఖ్యానించారు. పోలీసుల ప్రవర్తనపై ఏ ఒక్కరూ స్పందించలేదని అన్నారు.

More Telugu News