Chandrababu: చంద్రబాబుకు జ్వరమొచ్చినా అది మోదీ కుట్రే అంటున్నారు!: కన్నా లక్ష్మీనారాయణ

  • మోదీని చూసి చంద్రబాబు భయపడుతున్నారు
  • గత ఎన్నికల్లో ఇద్దరు దొంగలు పోటీ చేశారు
  • చంద్రబాబు బెటర్ దొంగ అని ప్రజలు ఎన్నుకున్నారు

సీఎం చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాలో మాట్లాడుతూ, చంద్రబాబుకు జ్వరమొచ్చినా అది మోదీ కుట్రే అంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీని చూసి బాబు భయపడుతున్నారని, గత ఎన్నికల్లో ఇద్దరు దొంగలు పోటీ చేస్తే, వారిలో చంద్రబాబు బెటర్ దొంగ అని ప్రజలు ఎన్నుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబ్లీ ప్రాజెక్టు వద్ద నిరసన తెలిపిన ఘటనలో ధర్మాబాద్ కోర్టు వారంట్ జారీ చేసిన విషయంలో చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట సంఘటన గురించి కన్నా ప్రస్తావించారు. గోదావరి పుష్కరాల ప్రచారం కోసం జియో గ్రాఫిక్ ఛానల్ కు నాడు రూ.64 లక్షలు ఇచ్చారని, అందుకే, వీఐపీ ఘాట్ ఉండగా సాధారణ యాత్రికుల ఘాట్ కు చంద్రబాబు వెళ్లారని, టెలీ ఫిల్మ్ కోసం 29 మందిని పొట్టనపెట్టుకోవడం దురదృష్టకర సంఘటన అని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన కేవలం మానవ తప్పిదం వల్లే జరిగిందని, మీడియా అతివల్ల ఈ సంఘటన జరిగిందని కమిటీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తొక్కిసలాట ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కన్నా డిమాండ్ చేశారు.

More Telugu News