ntr: 'అరవింద సమేత' నుంచి మనసును కట్టిపడేస్తోన్న 'పెనివిటి' పాట

  • త్రివిక్రమ్ నుంచి 'అరవింద సమేత'
  • ముగింపు దశలో షూటింగ్ 
  • అక్టోబర్ 11వ తేదీన భారీ విడుదల      

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

"నిద్దరినీ ఇరిచేసి రెప్పల్ని తెరిసాను .. నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను .. ఓటెద్దు బండెక్కి రారా .. సగిలేటి డొంకల్లో పదిలంగా రారా .." అంటూ ఈ పాట సాగుతోంది. చాలాకాలం క్రితం తనకి దూరమైన భర్త కోసం ఎదురుచూస్తూ ఓ భార్య పాడుకునే పాట ఇది. మనసు అరలను తడుపుతూ .. కన్నీటి పొరలను దాటుకుని ఉబికే పాట ఇది. రాయలసీమ యాసలో వాడుక పదాలను ఉపయోగిస్తూ రామజోగయ్య శాస్త్రి ఈ పాటను అద్భుతంగా రాశారు. తమన్ సంగీతం హృదయాలకి హత్తుకునేలా వుంది. ఇంతవరకూ ఆయన చేసిన మనసు పాటల్లో ఇది ఒకటిగా చేరుతుందని చెప్పొచ్చు.

More Telugu News