NItyananda: స్వామి నిత్యానంద సంచలన ప్రకటన.. గోవులతో సంస్కృతం మాట్లాడిస్తారట!

  • ఆవులతో సంస్కృతం, తమిళం మాట్లాడిస్తా
  • పులులు, కోతుల కోసం ప్రత్యేక స్వరపేటిక
  • ఏడాదిలోపే నిరూపిస్తా

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఆవులతో సంస్కృతం, తమిళ భాషలు మాట్లాడిస్తానని పేర్కొన్నారు. ఏడాది లోపే ఈ అద్భుతాన్ని చేసి చూపిస్తానని శపథం చేశారు. తానీ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపిస్తానని పేర్కొన్నారు. అంతేకాదు, కోతులు, పులులు, సింహాల కోసం కూడా భాషా సామర్థ్యమున్న స్వరపేటికను అభివృద్ధి చేస్తానని, ఇందుకోసం ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా అభివృద్ధి చేసినట్టు తెలిపారు. దానిని పరీక్షించిన తర్వాతే తానీ ప్రకటన చేస్తున్నానని, ఏడాదిలోపు గోవులతో సంస్కృతంలో మాట్లాడిస్తానని పునరుద్ఘాటించారు.

More Telugu News