Telugudesam: ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీ నేతల అత్యవసర భేటీ!

  • మహాకూటమిపై చర్చించిన నేతలు
  • ఎల్ రమణ ఆధ్వర్యంలో సమావేశం
  • టీజేఎస్ తో కలిసి ముందుకెళ్లడంపై చర్చ

ఎన్టీఆర్ భవన్ లో ఈ రోజు తెలంగాణ తెలుగుదేశం నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి టీటీడీపీ చీఫ్ ఎల్ రమణతో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. త్వరలో ప్రతిపక్షాలతో కలిసి ఏర్పాటు చేయనున్న మహా కూటమితో పాటు చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు ఇవ్వడంపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ జనసమితి అధినేత కోదండరాంతో కలసి వెళ్లే విషయాన్ని కూడా పలువురు నేతలు ఈ భేటీలో ప్రస్తావించారు. 

  • Loading...

More Telugu News