Reliance: జూలైలో దుమ్మురేపిన జియో.. ప్రత్యర్థుల కంటే 13 రెట్లు ఎక్కువగా వినియోగదారుల చేరిక!

  • జూలైలో 1.18 కోట్ల మంది చేరిక
  • 22.7 కోట్లకు చేరుకున్న వినియోగదారుల సంఖ్య
  • 19.6 శాతానికి చేరుకున్న సబ్‌స్క్రైబర్ల బేస్

ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో మరోమారు సత్తా చాటింది. జూలై నెలలో దాదాపు 1.18 కోట్ల మందిని ఖాతాదారులుగా చేర్చుకుంది. టెలికం దిగ్గజ సంస్థలైన ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌లు మొత్తంగా 9.27 లక్షల మందిని మాత్రమే కొత్త వినియోగదారులను చేర్చుకోగా, జియో దీనికి 13 రెట్లు అధికంగా చేర్చుకుంది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఈ వివరాలను విడుదల చేసింది. కొత్తగా చేరిన ఖాతాదారులతో కలుపుకుని జియో మొబైల్ సబ్‌స్క్రైబర్ల బేస్ 19.6 శాతానికి చేరుకుంది. అలాగే, జియో మొత్తం ఖాతాదారుల సంఖ్య 22.7 కోట్లకు చేరుకుంది.  

More Telugu News