nagachaitanya: 'సవ్యసాచి'కి రేపు గుమ్మడికాయ కొట్టేస్తున్నారు

  • చందూ మొండేటి దర్శకుడిగా 'సవ్యసాచి'
  • చైతూ జోడీగా నిధి అగర్వాల్ 
  • ముఖ్యపాత్రల్లో భూమిక .. మాధవన్

నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా ముగింపు దశకి చేరుకుంది. రేపు చివరి సీన్ ను చిత్రీకరించి .. గుమ్మడికాయ కొట్టేస్తారట.

ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకోవలసి వుంది. కానీ ముందుగా చైతూ 'శైలజా రెడ్డి అల్లుడు'ను అవ్వగొట్టేద్దామనుకోవడం వలన ఆలస్యమైంది. డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో, మాధవన్ .. భూమిక కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు' అనే సాంగును రీమిక్స్ చేశారు. అది ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది.   

  • Loading...

More Telugu News