indrani mukerjea: విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఇంద్రాణి దంపతులు!

  • ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు
  • పరస్పరం అంగీకారంతోనే విడిపోవాలనుకుంటున్నామంటూ పిటిషన్
  • ఆస్తులను సమంగా పంచుకునేందుకు అంగీకారం

కూతురు షీనా బోరా హత్య కేసులో రిమాండు ఖైదీగా జైలులో ఉన్న ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియాలు విడిపోయేందుకు సిద్ధమయ్యారు. ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో వారు ఈ మేరకు విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోయేందుకు సిద్ధమయ్యామని పిటిషన్ లో వారు పేర్కొన్నారు. ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివరాలను కూడా పిటిషన్ లో పొందుపరిచారు.
 
సిండికేట్ బ్యాంకులో ఉన్న 53 కోట్ల విలువైన ఫిక్స్ డ్ డిపాజిట్ బాండ్లు, అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లు, విలువైన నగలు, ఖరీదైన వాచ్ లు, బ్యాంకు లాకర్లు, విదేశాల్లో ఉన్న బంగ్లాలను సమంగా పంచుకునేందుకు తమకు సమ్మతమేనని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటివరకు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ అకౌంట్లను వ్యక్తిగత అకౌంట్లుగా మార్చుకునేందుకు కూడా అంగీకరించారు.

16 ఏళ్ల క్రితం మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియాను ఇంద్రాణి పెళ్లాడింది. ఇది వీరిద్దరికీ రెండో వివాహమే. ముంబైలోనే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2002లో వీరు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే పీటర్ కుమారుడు రాహుల్ తో ఇంద్రాణి కుమార్తె షీనా బోరా ప్రేమలో పడడంతో... వీరి వైవాహిక జీవితంలో ఆటుపోట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో, 2012లో షీనాను వీరు హత్య చేయడం జరిగింది. మూడేళ్ల తర్వాత ఈ కేసు వెలుగు చూడడంతో 2015లో ఇంద్రాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

More Telugu News