akhil: 'మిస్టర్ మజ్ను' ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే!

  • ముగింపు దశలో 'మిస్టర్ మజ్ను'
  • రేపు రిలీజ్ కానున్న ఫస్టులుక్ 
  • జనవరి 26వ తేదీన సినిమా విడుదల  

అఖిల్ మూడవ సినిమాగా 'మిస్టర్ మజ్ను' రూపొందుతోంది. వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి రేపు ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ ఫస్టులుక్ కోసం అఖిల్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ముందుగా ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ సమయంలో రంగంలోకి దిగడానికి చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. అందువలన జనవరి 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నాగార్జున భావిస్తున్నట్టుగా సమాచారం. గతంలో తను నటించిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వలన, ఈ సినిమాపైనే అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు.     

  • Loading...

More Telugu News