Telangana: మైనర్‌ బాలికపై యువకుడి లైంగిక దాడి: పొలాల్లోకి తీసుకువెళ్లి బలవంతం

  • బాధితురాలు తొమ్మిదో తరగతి విద్యార్థిని
  • ప్రేమ పేరుతో వెంట పడుతున్న నిందితుడు
  • సిద్ధిపేటలో ఇటీవల జరిగిన ఘటన

ప్రేమ పేరుతో ఓ మైనర్‌ బాలిక వెంట పడుతున్న యువకుడు అవకాశం చూసుకుని ఆమెను పొలాల్లోకి బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు... తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా శివరంపురానికి చెందిన ఓ కుటుంబం నగరానికి వలస వచ్చింది. బాలిక తండ్రి రామకృష్ణాపురంలోని ఓ అపార్ట్‌మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలు తొమ్మిదో తరగతి చదువుతోంది.

ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రాజు (25) కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల బాధిత బాలిక బోనాలకు సిద్ధిపేటలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన రాజు ఆ ఊరెళ్ళాడు. ఎవరూ లేని సమయంలో బాలికను సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది తెలిసిన బాలిక తల్లిదండ్రులు నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

More Telugu News