Maharashtra: మహారాష్ట్ర స్కూల్‌లో దారుణం.. ర్యాగింగ్ పేరుతో బాలురపై వేధింపులు.. ప్రైవేటు పార్ట్స్‌ను దారంతో కట్టి చిత్రహింసలు!

  • వేదిక్ పాఠశాలలో దారుణ ర్యాగింగ్
  • ఇద్దరు బాలురను వేధించిన మరో ఇద్దరు
  • స్కూలు డైరెక్టర్ సహా బాలుర అరెస్ట్

మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో ఉన్న ఓ స్కూల్‌లో దారుణం జరిగింది. తొమ్మిది, పదేళ్లున్న ఇద్దరు విద్యార్థులను 10, 13 సంవత్సరాల వయసున్న ఇద్దరు విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో వేధించారు. బాలురను కొట్టి, వారి రహస్య భాగాలను మాంజా (గాలిపటాలు ఎగరవేసే దారం)తో కట్టి హింసించారు. పర్బానీలోని గణేశ్ వేదిక్ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ పర్‌దేశీ తెలిపారు. ఈ కేసులో వేదిక్ స్కూలు డైరెక్టర్ కులకర్ణిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం... ఆగస్టు 26-సెప్టెంబరు 12 మధ్య ఈ ఘటన జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో తాజాగా విషయం వెలుగుచూసింది. ర్యాగింగ్‌పై బాధిత విద్యార్థులు 42 ఏళ్ల స్కూలు డైరెక్టర్ కులకర్ణికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వారు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  కులకర్ణిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులైన 10, 13 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురను కూడా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వేదిక్ పాఠశాలను అక్రమంగా నడుపుతున్నారని, కేవలం ఆరుగురు విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారని తెలిపారు. రిజిస్టర్‌లో ఆ విషయాన్ని కూడా నమోదు చేయలేదని తెలిపారు. కాగా, కులకర్ణిని కోర్టులో ప్రవేశపెట్టగా జుడీషియల్ రిమాండ్‌కు పంపింది. నిందితులైన ఇద్దరు బాలురను జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట ప్రవేశపెట్టామని,  అనంతరం వారిని రిమాండ్ హోంకు తరలించినట్టు ఎస్పీ పరదేశ్ తెలిపారు.  

More Telugu News