Smriti Irani: చిన్నప్పుడు తాను నివసించిన ఇంటిని చూసి ఏడ్చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ!

  • 35 ఏళ్ల క్రితం తాను నివసించిన ఇంటిని సందర్శించిన స్మృతి
  • ఇంటికి బదులు లాండ్రీ షాపును చూసి కన్నీరు
  • చుట్టుపక్కల వారితో మాటామంతీ

తాను చిన్నప్పుడు నివసించిన ఇంటిని చూసి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కన్నీరు పెట్టుకున్నారు. 35 ఏళ్ల తర్వాత మంత్రి గురుగ్రామ్‌లోని తాను నివసించిన ఇంటిని సందర్శించారు. అక్కడి పరిసరాలు పూర్తిగా మారిపోయాయి. తాను నివసించిన ఇల్లు డ్రైక్లీనింగ్ దుకాణంగా మారిపోవడంతో  కన్నీటిని ఆపుకోలేకపోయారు. భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న దుకాణాలను కూడా సందర్శించి వారితో మాట్లాడారు. తాను చిన్నప్పుడు ఇక్కడే తిరిగానని, ఈ దుకాణాల్లోనే చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కున్నానని చెప్పారు.  

తనకు అత్యంత సన్నిహితురాలు, ప్రముఖ నిర్మాత అయిన ఏక్తా కపూర్ అభ్యర్థన మేరకు స్మృతి ఇరానీ గురుగ్రామ్ సందర్శించాలని నిర్ణయించుకున్నారు. అయితే, అక్కడ తన ఇంటికి బదులు ఓ లాండ్రీ షాపును చూస్తానని ఆమె ఊహించలేకపోయారు. దీంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెను ఓదార్చేందుకు చాలామంది ప్రయత్నించినప్పటికీ కన్నీటిని మాత్రం దాచుకోలేకపోయారు. చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలను, అక్కడి మనుషులను చూసి స్మృతి భావోద్వేగానికి గురయ్యారు. వారితో సరదాగా మాట్లాడారు. అందరినీ పలకరిస్తూ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మూడున్నర దశాబ్దాల క్రితం తాను చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కున్న షాపుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు.

More Telugu News