Telangana: అవును.. ప్రణయ్ ను నేనే చంపించా.. పోలీసుల విచారణలో అంగీకరించిన మారుతీరావు!

  • గోల్కొండలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మరికాసేపట్లో మేజిస్ట్రేట్ ముందుకు
  • వేరే కులస్తుడిని పెళ్లి చేసుకోవడంతోనే హత్య

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులు అమృత తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్ కుమార్ లను గోల్కొండ పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అల్లుడు ప్రణయ్ ను తానే హత్య చేయించానని మారుతీరావు అంగీకరించాడు. కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా వేరే కులస్తుడిని పెళ్లి చేసుకోవడంతోనే ఈ దారుణానికి తెగబడినట్లు వెల్లడించాడు. ప్రణయ్ ను హత్య చేసేందుకు రూ.10 లక్షలతో డీల్ కుదుర్చుకున్నట్లు పేర్కొన్నాడు.

కాగా, నిందితుడిని పోలీసులు మరికాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. ప్రణయ్ హత్య నేపథ్యంలో ఈ రోజు దళిత సంఘాలు మిర్యాలగూడలో బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. బంద్ నేపథ్యంలో నగరంలోని దుకాణాలు, షాపులు మూతపడ్డాయి.

More Telugu News