Chandrababu: చంద్రబాబు వారి ట్రాప్ లో పడరాదు... మరో నోటీసు కూడా సిద్ధంగా ఉంది: హీరో శివాజీ

  • ఒక మనిషిని నిర్వీర్యం చేయడానికి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు
  • వారి ట్రాప్ లో చంద్రబాబు పడితే.. ఇబ్బందులు తప్పవు
  • మరో నోటీసు గురించి నేను చెప్పలేను

ఒక మనిషిని నిర్వీర్యం చేయడానికి, ఒక కుర్చీని ఆక్రమించుకోవడానికి ఇంత కుట్ర పూరిత రాజకీయాలు అవసరమా? అని హీరో శివాజీ మండిపడ్డారు. మన రాజ్యాంగం మనకు ఇచ్చిన స్ఫూర్తి ఇదేనా? అని ప్రశ్నించారు. మనుషుల్ని నలిపేద్దాం, ప్రభుత్వాలను కూల్చేద్దాం అనే విధంగా రాజకీయాలు చేయడం దారుణమని అన్నారు. సమాజంలో స్వేచ్ఛను కోల్పోయే పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పుడు వచ్చిన నోటీసులు దీనికి నిదర్శనమని చెప్పారు. ఈ ట్రాప్ లో చంద్రబాబు పడరాదని, ఈ ట్రాప్ లో ఆయన పడితే కచ్చితంగా మరో రెండు, మూడు నోటీసులు ఇస్తారని హెచ్చరించారు.

తాను గత మూడు రోజుల నుంచి లాయర్లతో మాట్లాడానని, ఈ నోటీసులకు సంబంధించిన పరిణామాల గురించి తెలుసుకున్నానని శివాజీ చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం కూడా ఈ ట్రాప్ లో ఇరుక్కోకూడదని చంద్రబాబుకు సూచించారు. మరో నోటీసు కూడా మీ కోసం రెడీగా ఉందని చెప్పారు. ఆ నోటీసు గురించి తాను బయటకు చెప్పలేనని... ఏపీలో తనకు భద్రత ఉందని, కానీ తన సామ్రాజ్యం మరో చోట ఉందని, నోటీసుల గురించి తాను మాట్లాడితే, తనకు అక్కడ భద్రత ఉండదని చెప్పారు.

  • Loading...

More Telugu News