వారెంట్ వచ్చినంత మాత్రాన.. చంద్రబాబు ప్రతిష్టకు భంగం వాటిల్లదు!: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
- కొందరు స్వార్థపరులు రాజకీయం చేస్తున్నారు
- ఆపరేషన్ గరుడలో భాగంగా వారెంట్ వచ్చిందనడం సరికాదు
- తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలి
చంద్రబాబుకు వారెంట్ వస్తే... ఆపరేషన్ గరుడలో భాగంగా వారెంట్ వచ్చిందంటూ వ్యాఖ్యానిస్తుండటం సరికాదని అన్నారు. ప్రజల తరపున బాబ్లీ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు పోరాడారని... నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చినంత మాత్రాన... ఆయన ప్రతిష్టకు ఎలాంటి భంగం వాటిల్లదని చెప్పారు. చట్టం తన పనిని తాను చేసుకుపోవడం సహజమేనని... పని కట్టుకుని తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు.