Snake: తాగిన మైకంలో పాముతో ఆటలు.. ప్రాణం తీసిన వైనం!

  • ఫుల్లుగా తాగి వస్తుండగా రోడ్డు పక్కన కనిపించిన పాము పిల్ల
  • పాముతో ఆడలాడుతుండగా వీడియో తీసిన ఆకతాయిలు
  • రెచ్చిపోయి పామును నోట్లో పెట్టుకున్న మహిపాల్ సింగ్

ఫుల్లుగా తాగి ఉన్న వ్యక్తిని ఆకతాయిలు రెచ్చగొట్టడంతో ఓ పాము పిల్లను అమాంతం మింగేశాడు. 4 గంటల్లో ఒళ్లంతా విషం వ్యాపించి అతను చనిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్‌రోహ జిల్లాలో కార్మికుడిగా జీవనం సాగిస్తున్న మహిపాల్ సింగ్(40) బుధవారం ఫుల్లుగా తాగి ఇంటికి వస్తుండగా అతనికి రోడ్డు పక్కన ఓ పాము పిల్ల కనిపించింది.

తాగిన మైకంలో దాంతో అతను ఆడుతుండగా కొందరు ఆకతాయిలు అతని చుట్టూ చేరి వీడియో తీయడం ప్రారంభించారు. దీంతో మరింత రెచ్చిపోయిన మహిపాల్ పామును నోట్లో పెట్టుకున్నాడు. అది కాస్తా జారి గొంతులోకి పోయింది. దాంతో మత్తు దిగిన ఆ వ్యక్తి, ఎంతగా వాంతులు చేసుకున్నా పాము పిల్ల మాత్రం బయటకు రాలేదు. దాన్ని మింగిన 4 గంటల్లోనే విషం ఒళ్లంతా వ్యాపించి మహిపాల్ చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News