Jammu And Kashmir: జమ్ములో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు

  • ఓ డీఎస్పీ సహా తొమ్మిది మందికి గాయాలు
  • బారాముల్లా జిల్లా సోపోర్‌లో ఘటన
  • ఉగ్రవాదులే తొలుత కాల్పులు జరిపారన్న అధికారి

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఈరోజు భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ డీఎస్పీ సహా తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనపై జమ్ము ఐజీ ఎస్.డి.సింగ్ మాట్లాడుతూ, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. సోపోర్‌ సమీపంలోని అరంపురం ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో, ఈ ఉదయం గాలింపు చర్యలు చేపట్టామని... ఈ సందర్భంగా తొలుత ఉగ్రవాదులే కాల్పులు జరిపారని ఓ పోలీసు అధికారి తెలిపారు. 

More Telugu News