balka suman: బాల్క సుమన్ ప్రచారాన్ని అడ్డుకున్న ఓదేలు అనుచరులు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న కార్యకర్త.. ఉద్రిక్తత!

  • బాల్క సుమన్ కు నిరసన సెగ
  • ఓదేలుకే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్
  • ఇందారంలో ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో చెన్నూరు టికెట్ ను ఎంపీ బాల్క సుమన్ కు కేటాయించడం నియోజకవర్గంలో ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. తాజా మాజీ ఎమ్మెల్యే ఓదేలు అనుచరులు తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలంటూ ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇందారంలో ఈరోజు బాల్క సుమన్ ప్రచారాన్ని ఓదేలు మద్దతుదారులు అడ్డుకున్నారు. తమ నేతకే టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో ముగ్గురికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. బాల్క సుమన్ కు వ్యతిరేకంగా ఓదేలు మద్దతుదారులు నినాదాలు చేశారు.

More Telugu News