Krishna District: కృష్ణా జిల్లాలో ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

  • గంపలగూడెం కొణిజర్లలో ఘటన
  • ప్రేమించాలని గోపీ అనే యువకుడి వేధింపులు
  • ఒప్పుకోకపోవడంతో దాడి

తనను ప్రేమించాలని వెంటపడ్డ యువకుడు చివరికి ఆమె అంగీకరించకపోవడంతో దాడికి తెగబడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లాలోని గంపలగూడెం కొణిజర్లకు చెందిన ఝాన్సీ స్థానిక కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన గోపీ అనే యువకుడు తనను ప్రేమించాలంటూ ఆమె వెంట పడ్డాడు. ఇందుకు యువతి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో నిన్న కళాశాల నుంచి ఇంటికి వస్తుండగా ఆమెను అడ్డుకున్న గోపీ.. దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన యువతి నిన్న పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

గోపీ వేధింపుల కారణంగానే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News