‘కాంగ్రెస్’కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: కొణిజేటి రోశయ్య

- రోశయ్యను సన్మానించిన ఏపీసీసీ
- ‘కాంగ్రెస్’ జెండా కనబడితే ఉత్సాహం వస్తుంది
- కాంగ్రెస్ జెండా ఎప్పుడూ ఎగరాలని కోరుకుంటా
తాను విజయవాడ రావడం కూడా కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, ఇప్పుడు పార్టీకి ఏమి చేయాలన్నా తనకు శక్తి సరిపోదని, ఉన్నవారు మాత్రం తమ శక్తిని కూడగట్టుకొని పార్టీ కోసం పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన అంశంపై ఆయన మాట్లాడారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని తాను అనుకోవడం లేదని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని రోశయ్య అన్నారు.