petrol: వాహనదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం!

  • పెట్రోల్, డీజిల్ పై రూ.2 తగ్గిస్తూ నిర్ణయం
  • ఖజానాపై భారీగా పడనున్న భారం
  • కేంద్రం కూడా పన్నులు తగ్గించాలని  విజ్ఞప్తి

పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయి అల్లాడుతున్న సామాన్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెట్రోల్, డీజిల్ పై రూ.2 మేర వ్యాట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించారు. పెట్రోల్ బాదుడుకు నిరసనగా ఈ రోజు ప్రతిపక్షాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1,120 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని చంద్రబాబు తెలిపారు. అయినా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. కేంద్రం కూడా వెంటనే స్పందించి పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని చంద్రబాబు కోరారు.

More Telugu News