k kesava rao: జోరు పెంచిన టీఆర్ఎస్.. కేకే నివాసంలో సమావేశం నిర్వహించిన కేటీఆర్!

  • జోరు పెంచిన టీఆర్ఎస్ నేతలు
  • కేకే నివాసంలో తాజా పరిణామాలపై కేటీఆర్ సమావేశం
  • హాజరైన పలువురు నేతలు

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది. ఓ వైపు ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుంటూనే, మరోవైపు ఎన్నికల ప్రచార కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకే నివాసంలో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై పలువురు నేతలతో ఆయన చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, రవీంద్ర కుమార్, జీవన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్ లు హాజరయ్యారు. 

More Telugu News