కాంగ్రెస్ నేత సురేశ్ రెడ్డిని స్వయంగా కలిసిన కేటీఆర్.. టీఆర్ఎస్ లో చేరే అవకాశం!
- కీలక బాధ్యతలు ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్ధం
- సానుకూలంగా స్పందించిన సురేశ్ రెడ్డి
- జిల్లాలో డీఎస్ కి చెక్ పెట్టడానికే
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి 2004లో సురేశ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2004 నుంచి 2009 వరకూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. తాజాగా నిజామాబాద్ లో డీఎస్ వ్యవహారం తలనొప్పిగా మారిన నేపథ్యంలో సురేశ్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా విజయావకాశాలను మెరుగుపర్చుకోవచ్చని టీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తోంది. కేవలం సురేశ్ రెడ్డి మాత్రమే కాకుండా మరికొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్ కి టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కాంగ్రెస్ లోకి తిరిగివస్తారన్న నేపథ్యంలోనే సురేశ్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమైనట్లు సమాచారం.