ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్ పరిధులు దాటకుండా చూడాలని గవర్నర్ ను కోరాం: బీజేపీ నేత లక్ష్మణ్

- గత అనుభవాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం
- మాకున్న ఆందోళన, అనుమానాలను చెప్పాం
- గత ఎన్నికలలో అధికారులు టీఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరించారు
తమకున్న ఆందోళన, అనుమానాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గత అనుభవాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. గతంలో జరిగిన ‘గ్రేటర్’ ఎన్నికలలో అధికారులు టీఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరించారని ఆరోపించారు. కాగా, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, తెలంగాణలో పరిపాలన స్తంభించిందని, కేసీఆర్ అడుగులకు మడుగులొత్తుతూ అధికారులు పనిచేశారని, అసెంబ్లీ రద్దు అప్రజాస్వామికమని విమర్శించారు.