kcr: బీజేపీ మాకు మిత్రపక్షం కాదు.. ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ: కేసీఆర్

  • ఎంఐఎంతో కలసి పని చేస్తాం
  • ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం
  • ప్రగతి చక్రం ఆగకూడదనే అసెంబ్లీ రద్దుకు వెళ్లాం

బీజేపీతో టీఆర్ఎస్ కు ఉన్న సంబంధాలపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతనిచ్చారు. బీజేపీ తమ మిత్రపక్షం కాదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. ఎంఐఎం తమకు ఫ్రెండ్లీ పార్టీ అని, ఆ పార్టీతో కలసి పని చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రగతి చక్రం ఆగకూడదనే అసెంబ్లీ రద్దుకు వెళ్లామని చెప్పారు. క్రమశిక్షణతో, నిబద్ధతతో ముందుకు వెళ్లినందుకే తాము ఇంత ప్రగతిని సాధించామని అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లలో 17.17 శాతం ఆర్థిక ప్రగతిని సాధించామని... ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 21.96 శాతం ప్రగతిని సాధించిందని చెప్పారు.

More Telugu News