vijay devarakonda: 'గీత గోవిందం' సినిమాకి దక్కిన మరో రికార్డు

  • తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ 
  • ఓవర్సీస్ లో భారీ వసూళ్లు 
  • తమిళనాట అదే జోరు

విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా నటించిన 'గీత గోవిందం' చిత్రం సంచలన విజయం సాధించింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాను తమిళనాడులోను విడుదల చేశారు. తమిళనాడులో విడుదల చేసిన తెలుగు వెర్షన్ కి కూడా అనూహ్యమైన స్పందన లభించింది.

అక్కడ విడుదలైన తెలుగు వెర్షన్ ఇంతవరకూ 5 కోట్లకి పైగా వసూలు చేసిందట. తమిళనాట ఒక తెలుగు సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం మరో రికార్డు అని చెబుతున్నారు. అక్కడి తెలుగువారితో పాటు .. తమిళ యూత్ కూడా ఆదరించడం వల్లనే ఈ సినిమాకి ఈ స్థాయి విజయం సాధ్యమైందని అంటున్నారు. సింపుల్ గా అనిపించే ప్రేమకథను పరశురామ్ కొత్తగా ఆవిష్కరించిన తీరు, విజయ్ దేవరకొండకి గల క్రేజ్ ఇందుకు కారణమని చెప్పుకుంటున్నారు.     

More Telugu News