పాన్ కార్డుపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. సింగిల్ పేరెంట్స్ కు ఊరట!
- ముసాయిదా విడుదల చేసిన కేంద్రం
- 17లోపు అభ్యంతరాలు తెలపాలని విజ్ఞప్తి
- తండ్రి పేరు తప్పనిసరి నిబంధనపై దృష్టి
దీనిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 17లోపు తెలియజేయాలని కేంద్రం ప్రజలను కోరింది. దీని ప్రకారం పాన్ దరఖాస్తులో కేవలం తల్లి పేరు రాస్తే సరిపోతుందని వెల్లడించింది. పాన్ కార్డు లేకుండా ఎవరైనా ఓ ఏడాదిలో జరిపిన ఆర్థిక వ్యవహారాల విలువ రూ.2.50 లక్షలకు మించితే.. మరుసటి ఏడాది మే 31లోపు వారు పాన్ తీసుకునేలా ఈ ముసాయిదాలో ఓ ప్రతిపాదనను చేర్చారు.