rajanna dora: పదవికి రాజీనామా చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే రాజన్నదొర

  • కరాసువలసలో 15 రోజుల్లో 9 మంది విషజ్వరాలతో చనిపోయారు
  • వైసీపీ నేతలు నోరు మెదపడం లేదు
  • ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

పదవికి రాజీనామా చేస్తానంటూ వైసీపీ సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర సంచలన ప్రకటన చేశారు. సాలూరు మండలం కరాసువలసలో గత 15 రోజుల్లో 9 మంది విషజ్వరాలతో చనిపోయారని... దీనిపై వైసీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు కూడా నోరు మెదపలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనాలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. మరో మూడు రోజుల్లో అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.

More Telugu News