పుంగనూరు ఆవు అంటే హరికృష్ణకు ఎంతిష్టమో.. మూడు రోజుల్లో చూసేందుకు వస్తానని మాటిచ్చిన వైనం!
- బోరున విలపిస్తున్న శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు
- మూడు నెలలకోసారి గ్రామానికి
- బర్త్ డే తర్వాత వస్తానని మాటిచ్చిన హరికృష్ణ
హరికృష్ణతో శ్రీనివాసరావు కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. మూడు నెలలకోసారి హరికృష్ణ గ్రామానికి వచ్చి గోవులను చూసి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లేవారు. పుంగనూరు ఆవు ఇటీవల ఓ దూడకు జన్మనివ్వడంతో దానిని చూడడానికి వస్తానని శ్రీనివాసరావుకు చెప్పారు. పుట్టిన రోజు తర్వాత వస్తానని శ్రీనివాసరావుకు మాటిచ్చారట. అయితే, అంతలోనే ఇలా జరగడాన్ని శ్రీనివాసరావు కుటుంబం తట్టుకోలేకపోతోంది.
ఓసారి కొందరు వ్యక్తులు ఓ గేదెను కబేళాకు తరలిస్తుంటే చూసిన హరికృష్ణ వారిని అడ్డుకుని దానిని శ్రీనివాసరావు వద్దకు తీసుకెళ్లారు. దానిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఇక తనకు ఎంతో ఇష్టమైన పుంగనూరు ఆవును తనతోపాటు హైదరాబాద్ తీసుకెళ్లాలని అనుకున్నారట. అయితే, దాని సంరక్షణ బాధ్యతలు కష్టంగా భావించిన ఆయన వెనక్కి తగ్గి శ్రీనివాసరావుకే ఆ బాధ్యతలు అప్పగించారట.