hari krishna: నాడు ఎన్టీఆర్ మొట్టమొదటి విగ్రహాన్ని ఆవిష్కరించింది హరికృష్ణే!

  • హిందూపురానికి నాలుగేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న హరికృష్ణ
  • రాష్ట్రంలో మొట్టమొదటి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అక్కడే
  • నాడు భారీ మెజార్టీతో గెలిచిన హరికృష్ణ

అనంతపురం జిల్లాలోని హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మరణానంతరం 1996లో జరిగిన ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసిన హరికృష్ణ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఘనత హరికృష్ణదే.

 నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్.లక్ష్మినారాయణరెడ్డిపై భారీ మెజారిటీ (62 వేల)తో నందమూరి హరిక‌ష్ణ విజయం సాధించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో ఎన్టీఆర్ మొట్టమొదటి విగ్రహాన్ని ఆవిష్కరించింది హిందూపురంలోనే. నాడు ఎమ్మెల్యే హోదాలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించింది హరికృష్ణే. హిందూపురానికి 1996 నుంచి నాలుగేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న హరికృష్ణ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

More Telugu News