hari krishna: ఎన్టీఆర్ ను అసెంబ్లీకి పంపిన 'చైతన్యరథం'లోనే హరికృష్ణ అంతిమయాత్ర!

  • చైతన్య రథంలో రాష్ట్ర నలుమూలల్లో పర్యటించిన ఎన్టీఆర్
  • చైతన్య రథ సారథిగా హరికృష్ణ
  • ఇప్పుడు హరికృష్ణ కోసం మరోసారి సిద్ధమవుతున్న చైతన్య రథం

తెలుగువారి ఆత్మాభిమానం కోసం తెలుగుదేశం పార్టీని నెలకొల్పిన దివంగత ఎన్టీఆర్ నిర్వహించిన చైతన్య యాత్రలో హరికృష్ణ పాత్ర అత్యంత కీలకమైనది. 72వేల కిలోమీటర్ల ఆ యాత్రకు ఆయన సారథిగా వ్యవహరించారు. యాత్ర పూర్తయ్యేంత వరకు తండ్రినే వెన్నంటి ఉన్నారు. ఈ చైతన్య రథమే ఎన్టీఆర్ ను అసెంబ్లీకి పంపింది. ఆయనను ముఖ్యమంత్రిని చేసింది. ఈ చైతన్యరథంతో హరికృష్ణది ప్రత్యేకమైన అనుబంధం. ప్రస్తుతం హైదరాబాదు, నాచారంలోని రామకృష్ణ స్టూడియోలో ఈ వాహనం ఉంది. హరికృష్ణ అంతిమయాత్రకు ఈ వాహనాన్నే ఉపయోగించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. దీంతో, హరికృష్ణ కోసం చైతన్యరథం మరోసారి సిద్ధమవుతోంది. 

More Telugu News