nandamuri: నందమూరి హరికృష్ణ మృతిపై స్పందించిన హీరోయిన్ సిమ్రాన్!

  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిమ్రాన్
  • కుటుంబ సభ్యులకు సానుభూతి
  • ట్విట్టర్ లో స్పందించిన నటి

నందమూరి హరికృష్ణ ఈ రోజు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై నటి సిమ్రాన్ స్పందించారు. హరికృష్ణ ఇకలేరన్న వార్త తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు సిమ్రాన్ వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

‘నందమూరి హరికృష్ణ ఇక లేరన్న వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని సిమ్రాన్ ఈ రోజు ట్వీట్ చేశారు. సిమ్రాన్ హరికృష్ణతో కలసి 'సీతయ్య' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

More Telugu News