Harikrishna: ప్రమాదం సమయంలో హరికృష్ణ కారు వేగం గంటకు 160 కి.మీ.!

  • తలకు బలమైన గాయం
  • రక్తం చాలాపోయింది
  • మరో ముగ్గురికీ తీవ్ర గాయాలు
  • వెల్లడించిన ఎస్పీ రంగనాథ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదం జరిగిన సమయంలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని నల్గొండ ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం అయ్యిందని, రక్తం చాలా పోయిందని అన్నారు.

కారులో ఆయనతో పాటు మరో నలుగురు ఉండగా, ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయని, విషయం తెలుసుకున్న వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశామని అన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగి, వందలాది మందిని బలిగొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News