స్నేహితుల ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- రాజకీయాల్లోకి ఇక తిరిగి రాను
- గ్రామీణులకు సేవ చేయాలన్న చివరి కోరిక మిగిలి ఉంది
- ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు
2020 జనవరి 12నాటికి ఢిల్లీ వదిలిపెట్టి వెళ్లాలని తాను ఉపరాష్ట్రపతి కాకముందు అనుకున్నానని, అయితే చివరి క్షణంలో ఆ పదవికి ఎంపికైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పదవికి వన్నె తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్టు వివరించారు. రాజకీయాలు వదిలిపెట్టి గ్రామీణ ప్రజలకు సేవ చేయాలన్న చివరి కోరిక మిగిలి ఉందని చెప్పిన వెంకయ్యనాయుడు, రాజకీయాల్లోకి ఇక తిరిగి రానని స్పష్టం చేశారు. ప్రజల భాషలోనే పరిపాలన సాగాలని, అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని, చట్ట సభల పనితీరు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.