guntru: గుంటూరు సభకు తరలి వచ్చిన ముస్లింలు.. మార్మోగుతున్న ‘నారా హమారా’ నినాదాలు!

  • గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభ
  • రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన ముస్లింలు
  • మోదీని ఎదిరించిన బాబుకు అండగా ఉంటాం 
  • ‘మోదీ హఠావో..దేశ్ కో బచావో’: ముస్లిం నేతలు

గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభ ప్రారంభమైంది. స్థానిక కేబీఆర్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ముస్లింలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు ముస్లిం సంప్రదాయ దుస్తులు ధరించారు. ఏపీ మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, నారా లోకేశ్, పరిటాల సునీత తదితరులు హాజరయ్యారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు, ఆ పార్టీ నేత లాల్ జాన్ బాషా చిత్రపటాలకు నేతలు నివాళులర్పించారు. ‘నారా హమారా’, ‘చంద్రన్న మళ్లీ నువ్వే రావాలి’ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగుతోంది.వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఓటు వేస్తే బీజేపీ ఖాతాలోకే వెళ్తుందని, భారతీయ జనతా పార్టీతో వైసీపీ ములాఖత్ అయి ముస్లింలకు ద్రోహం చేస్తోందని ముస్లిం నేతలు తమ ప్రసంగాల్లో ఆరోపించారు. మోదీని ఎదిరించిన చంద్రబాబుకే తాము అండగా ఉంటామని, ‘మోదీ హఠావో..దేశ్ కో బచావో’ అని నినదించారు. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటుకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News