Amaravati: మొన్న జగన్ ను కలిసిన మాజీ డీజీపీ సాంబశివరావు... నేడు చంద్రబాబుతో చర్చలు!

  • అమరావతికి వచ్చిన సాంబశివరావు
  • సీఎంతో సుమారు 20 నిమిషాల చర్చ
  • కొత్త రాజకీయ చర్చ మొదలు!

  ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సాంబశివరావు ఈ ఉదయం అమరావతికి వచ్చి సీఎం చంద్రబాబునాయుడిని కలిశారు. మూడు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను కలిసిన తరువాత సాంబశివరావు ఆయన పార్టీలో చేరనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును సాంబశివరావు కలవడం మరో కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. వీరిరువురూ సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్టు తెలుస్తుండగా, వారి మధ్య జరిగిన సంభాషణల వివరాలు బయటకు రాలేదు.  

More Telugu News