Chandrababu: మీ నలభై ఏళ్ల అనుభవం ఏమైనట్లు?: చంద్రబాబును ప్రశ్నించిన విజయసాయిరెడ్డి

  • నరేంద్ర మోదీది అనుభవరాహిత్యం అంటున్నారు మీరు!
  • అది తెలుసుకోవడానికి మీకు నాలుగేళ్లుపైనే పట్టింది
  • నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారు

ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రాభివృద్ధికి గండి కొడుతున్న ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మోదీని చంద్రబాబు విమర్శించడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ‘ఫేస్ బుక్’ లో ఓ పోస్ట్ చేశారు.
 
‘చంద్రబాబు నాయుడు గారూ, నరేంద్ర మోదీ గారిది వట్టి అనుభవరాహిత్యం అంటున్నారు మీరు. అది తెలుసుకోవడానికి మీకు నాలుగేళ్లుపైనే పట్టిందంటే... మరి మీ 40 ఏళ్ల అనుభవం ఏమైనట్లు? నాలుగేళ్లుగా మీరు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారు. సంకీర్ణ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేయాలంటే నాయకుడికి అనుభవంతోపాటు, కృతనిశ్చయం కూడా కావాలి. మీ విషయంలో…ఈ రెండూ లోపించాయన్నది సుస్పష్టం.

మీ నాయకత్వ లోపాలను మీ పార్టీ ఎంపీలే ఎత్తి చూపుతున్నారు. మీ యాత్రలు, ధర్మ పోరాటాలతో రాష్ట్ర ఖజానాపై మరింత భారం, ప్రజల నెత్తిపై మీరు మోపిన అప్పులు పెరగడం తప్ప ఒరిగేదేమీ లేదు. ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడంలో మీరు దారుణంగా విఫలమయ్యారు. మీ పార్టీ నాయకులు, మీ సమక్షంలోనే... మీకు ఇస్తున్న సందేశం అదే..వినబడలేదా?’ అని ఆ పోస్ట్ లో విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

More Telugu News