Krishna District: బ్యూటీషియన్ పద్మ కేసులో మరో ట్విస్ట్... 'ఎస్' అంటే సుబ్బయ్య... నూతన్ ని హత్య చేశారని అనుమానం!

  • పోలీసులను విస్తుపోయేలా చేస్తున్న విచారణ
  • నూతన్ ను హత్య చేసి పట్టాలపై పడేశారని పోలీసుల అనుమానం
  • సుబ్బయ్యను అరెస్ట్ చేస్తేనే మిస్టరీ వీడుతుందంటున్న అధికారులు

కృష్ణా జిల్లాలో బ్యూటీషియన్ పద్మపై జరిగిన దాడి కేసులో పోలీసులే విస్తుపోయే పెద్ద ట్విస్ట్ ఇది. ఆమెను హత్య చేయాలని చూసి, దారుణంగా ప్రవర్తించాడని భావిస్తున్న నూతన్ కుమార్ నిన్న రైలు పట్టాల వద్ద విగతజీవిగా కనిపించడంతో, పోలీసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని తొలుత భావించినప్పటికీ, అతన్ని ఎవరో హత్య చేసి పట్టాలపై పడేసి ఉంటారన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పద్మ తన వాంగ్మూలంలో సుబ్బయ్య అనే వ్యక్తి పేరు చెప్పగా, అతను ఎవరన్న విషయంపైనా విచారిస్తున్నారు. ఈ కేసులో సుబ్బయ్య రెండో నిందితుడని చెప్పిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

నూతన్ కుమార్ వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా, ఆయన భార్యకు కబురు పెట్టగా, ఆమె వచ్చి అతను తన భర్తేనని గుర్తించింది. నూతన్ ను సుబ్బయ్య హత్య చేసి ఉండవచ్చన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. పద్మ చేతిపై ఉన్న 'ఎన్' అన్న పచ్చబొట్టును కత్తితో చెరిపివేయడం, ఆపై నుదుటిపై 'ఎస్' అన్న అక్షరాన్ని రాయడం వెనుక ఉన్న మిస్టరీ, సుబ్బయ్యను అరెస్ట్ చేస్తే వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, నూతన్ తో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న పద్మ, గత సంవత్సర కాలంగా గొడవపడుతూ, హనుమాన్ జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు గుర్తించిన పోలీసులు, అప్పటి కంప్లయింట్ ను కూడా పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News