beautician padma: బ్యూటీషియన్ పద్మపై దాడి కేసు.. నిందితుడు నూతన్ కుమార్ ఆత్మహత్య!

  • రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న నూతన్
  • నరసరావుపేట-గుంటూరు మార్గంలో సంఘటన
  • రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు

బ్యూటీషియన్ పిల్లి పద్మపై హత్యాయత్నం కేసులో నిందితుడు, ఆమెతో సహజీవనం చేస్తున్న నూతన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసరావుపేట-గుంటూరు మార్గంలో రైలు కిందపడి నూతన్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు పట్టాలపై అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.  

కాగా, కృష్ణా జిల్లా బావులపాడులో బ్యూటీషియన్ పద్మపై ఈ దాడి జరిగింది. ఆమెతో సహజీవనం చేస్తున్న నూతన్ కుమార్, ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో అతని ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలించారు. 

  • Loading...

More Telugu News