nanduri samba siva rao: వైసీపీ అధినేత జగన్ ని కలిసిన ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు

  • వైసీపీ అధినేత జగన్ ని కలిసిన సాంబశివరావు
  • జగన్- సాంబశివరావుల మధ్య 15 నిమిషాల చర్చ
  • పార్టీలో చేరే విషయమై ప్రస్తావన?

వైసీపీ అధినేత జగన్ ని ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు ఈరోజు కలిశారు. విశాఖపట్టణం జిల్లా అచ్యుతాపురం సమీపంలోని ధార భోగాపురంలో ప్రజా సంకల్పయాత్ర శిబిరం వద్ద జగన్ ని ఆయన కలిశారు. ఈ సందర్భంగా జగన్ కు ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు. జగన్- సాంబశివరావు సుమారు 15 నిమిషాలు చర్చించుకున్నారు. ఈ విషయాన్ని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా, మాజీ డీజీపీ సాంబశివరావు త్వరలో వైసీపీలో చేరనున్నట్టు, ఈ నేపథ్యంలోనే జగన్ ని ఆయన కలిసినట్టు వైస్సార్సీపీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, సాంబశివరావు స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు.1987లో ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లికి ఏఎస్పీగా ఆయన కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత పదోన్నతులు పొందుతూ డీజీపీ స్థాయికి ఎదిగారు. ఏపీ డీజీపీగా గత ఏడాది ఆయన పదవీ విరమణ పొందారు.

More Telugu News