PandemKodi 2: 'పందెంకోడి-2' యూనిట్ సభ్యులకి దర్శకుడి నజరానా!

  • విశాల్, కీర్తి సురేశ్ జంటగా 'పందెంకోడి-2'
  • షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా యూనిట్‌ సభ్యులకు బంగారు నాణేల కానుక
  •  అక్టోబర్‌ 18న విడుదల కానున్న చిత్రం

తెలుగు, తమిళ చిత్ర రంగాలలో తమ సినిమా షూటింగ్ పూర్తయిన చివరి రోజున కొందరు హీరోలు, హీరోయిన్లు యూనిట్ సభ్యులకి కృతజ్ఞతాపూర్వకంగా చిన్న చిన్న కానుకలు ఇస్తుంటారు. అదే ఆనవాయతీని దర్శకుడు లింగుసామి కూడా ఇప్పుడు పాటించాడు. గతంలో విశాల్‌, మీరాజాస్మిన్‌ జంటగా నటించిన ‘పందెంకోడి' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది. విశాల్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న ఈ 'పందెంకోడి -2'కి కూడా లింగుసామి దర్శకుడు.

ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిన నేపథ్యంలో దర్శకుడు లింగుసామి యూనిట్‌ సభ్యుందరికీ బంగారు నాణేలను కానుకగా ఇచ్చాడు. దీంతో యూనిట్ సభ్యులు తెగ ఖుషీ అయ్యారట. విశాల్‌ ఫిల్మ్‌ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రపోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

More Telugu News