vishal: 'టెంపర్' తమిళ రీమేక్ మొదలెట్టిన విశాల్

  • విశాల్ హీరోగా 'టెంపర్' రీమేక్
  • టైటిల్ గా 'అయోగ్య'
  • కథానాయికగా రాశి ఖన్నా

ఎన్టీఆర్ ను కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సినిమాలలో 'టెంపర్' ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2015లో అభిమానులను ఆకట్టుకుంది. కంటెంట్ లోని కొత్తదనం కారణంగా వివిధ భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా తమిళ రీమేక్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిన్ననే చెన్నైలో మొదలయ్యాయి.

కలైపులి థాను .. మురుగదాస్ .. లింగుస్వామి .. కేఎస్ రవికుమార్ తదితరులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా నటించనుండగా, పార్తీబన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. 'అయోగ్య' పేరుతో నిర్మితమవుతోన్న ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో విశాల్ వున్నాడు. అక్కడ తన కెరియర్ కి ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుందని రాశి ఖన్నా భావిస్తోంది.     

More Telugu News